Pages

Thursday, February 21, 2013

Communal riots in india?



                                      మళ్ళి మత కల్లోహాలా .....?

తీవ్రవాదులు మల్లి మత కల్లోహాలు సృష్టించడానికి ప్రయత్నించారా అంటే .. అవుననే అన్పిస్తుంది.

నిన్న సాయంత్రం కోణార్క్ థియేటర్ వెంకటాద్రి  థియేటర్ల దగ్గర జరిగిన వరస బాంబు పేలుళ్ళ ఘటన ఈ అనుమానాలకు తావిస్తోంది
ఇంటలిజెన్స్ వర్గాలు ,స్థానికుల సమాచారం ఈ విషయాన్ని ద్రువీకరిస్తుంది . నిన్న పదహారు మంది ఆగంతకులు(భారతీయులు కారు ) రెండు జట్లుగా నడుచుకుంటూ చైతన్యపురి వయిపు వెళ్లినట్టు స్థానికుల సమాచారం . సంఘటన జరగడానికి కొద్ది సేపు ముందే వారు నడుచుకుంటు వెళ్ళడం అనుమానాలకు బలమిస్తోంది .
అయితే నిన్న జరిగిన వరస పేలుళ్లు ముందుగ అనుకున్న వ్యూహం కాదని నిన్న గురువారం కావడంతో భక్తులతో కిక్కిరిసి  ఉండే  సాయిబాబా దేవాలయం దగ్గర జరగల్సినవిగా భావిస్తున్నారు . అయితే నిన్న బాబా టెంపుల్ లో సిటీ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అక్కడ భద్రత కట్టు దిట్టం  చేయడంతో  పట్టుబడే అవకాశం ఉందని భావించిన దుండగులు దేవాలయం తర్వాత ఆ  ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే కోణార్క్ ,వేంకటాద్రి థియేటర్ల దగ్గర వరస పేలుళ్లు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు .
ఏది ఏమయినా అక్కడ ఈ సంఘటన జరిగి ఉంటె దాని ఫలితం ఇంకోలా ఉండేది . హైదరాబాద్ ప్రజలు సంయమనంతో వ్యవహరించి ఇలాంటి ఘటనలు మరో రంగు పులుముకోకుండా జాగ్రత్తపడాల్సిన సమయమిది.

No comments:

Post a Comment