ప్రభుత్వాల పాపం ప్రజలకు శాపం

పాలకులారా మేల్కొనండి ...హత్యా ప్రయత్నాన్ని కూడా పిటి కేసులాగా చిత్రీకరించె వ్యవస్థను ,166మందిని నిలువునా పొట్టన పెట్టుకున్న నర హంతకుడి మీద 50కోట్లు ఖర్చు పెట్టి 4న్నర సంవత్సరాలు కాలయాపన చేసి భాదితుల మనసులను చిద్రం చేసే చట్టాలను మార్చే ప్రయత్నం చేయండి . ఇటువంటి సంఘటనలు విచారించడానికి రాష్ట్రాల వారిగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి . నిందితులు ఎవరయినా ఎంతటి వారయినా ,అది నిర్భయ కేసయిన బాంబు పేలుళ్ళ కేసయిన ఒకేలా విచారించండి . ప్రజాస్వామ్య ముసుగులో మనవ హక్కుల పేరుతో హంతకులను కాపాడే ప్రయత్నం చేయకండి .
ప్రజాస్వామ్యం అంటే ప్రజలంతా స్వేచ్చగా బ్రతకడానికి దోహదం కావలె తప్ప అమాయకుల ప్రాణాలు హరించి విచారణ పేరుతో స్వేచ్చగా తిరగడం కాదు. ఈ విషయంలో ప్రజా సంఘాలు, ప్రజలు సరయిన రీతిలో స్పందించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
No comments:
Post a Comment